తెలంగాణలో రాక్షస పాలన: వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2021-10-30T17:48:45+05:30 IST

తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

తెలంగాణలో రాక్షస పాలన: వైఎస్ షర్మిల

హైదరాబాద్: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 11వ రోజు పాదయాత్రలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్‌నీ నమ్మి తెలంగాణ తన చేతిలో పెడితే ప్రజలను నట్టేట ముంచేశారని మండిపడ్డారు. ‘‘రెండుసార్లు అవకాశం ఇస్తే ఎవరు బాగుపడ్డారు. ప్రతి వర్గాన్ని కేసీఆర్ మోసం చేశారు. రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారు. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేశారు. పెన్షన్లు ఆపి వృద్ధులను మోసం చేశారు.10 లక్షల మంది పెన్షన్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. నాలుగేళ్లవుతున్నా పెన్షన్లు అందడం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యావత్ తెలంగాణను కేసీఆర్ మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి 7 ఏళ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు, అప్పుల పాలయ్యారు. ఇదేనా బంగారు తెలంగాణ... ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. మళ్లీ మళ్లీ కేసీఆర్ మాయలో పడొద్దు...మోస పోవద్దు’’ అని  షర్మిల కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-30T17:48:45+05:30 IST