TS News: వైఎస్సార్ ఫొటోతో ఓట్లెలా అడుగుతారు: వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2022-09-30T01:32:22+05:30 IST

సంగారెడ్డి: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదన్నారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 2004, 2009లో పార్టీని వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని

TS News: వైఎస్సార్ ఫొటోతో ఓట్లెలా అడుగుతారు: వైఎస్ షర్మిల

సంగారెడ్డి: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదన్నారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 2004, 2009లో పార్టీని వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని, కేంద్రంలోనూ అధికారంలోకి తేవడంలో వైఎస్సార్ కీలకం పాత్ర పోషించారని గుర్తు చేశారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే..ఎలా చనిపోయారని కూడా దర్యాప్తు చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైఎస్సార్ ఫొటోతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతోన్న పాదయాత్రలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-30T01:32:22+05:30 IST