వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చా: షర్మిల

ABN , First Publish Date - 2021-12-21T01:06:43+05:30 IST

రైతుల పక్షాన పోరాటం చేయడానికి తాను వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చానని వైఎస్ షర్మిల అన్నారు. మీ రాజకీయాల కోసం రైతులను బలిచేస్తారా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చా: షర్మిల

హైదరాబాద్: రైతుల పక్షాన పోరాటం చేయడానికి తాను వైఎస్ కూతురిగా మీ వద్దకు వచ్చానని వైఎస్ షర్మిల అన్నారు. మీ రాజకీయాల కోసం రైతులను బలిచేస్తారా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజన్న రాజ్యంలో రైతు రాజుగా మారిండని, ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేయబోమని కేంద్రం దగ్గర సంతకం ఎవరిని అడిగిపెట్టారని వ్యాఖ్యానించారు. మీ రాజకీయాల కోసం ఇంకెంతమంది రైతులను పొట్టనపెట్టుకుంటారని మండిపడ్డారు. రెండు నెలల్లో మరణించిన 200 మంది రైతులకు పైసా సహాయం చెయ్యలేదన్నారు. 

Updated Date - 2021-12-21T01:06:43+05:30 IST