ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం చేతకాని సీఎం మనకొద్దు: షర్మిల
ABN , First Publish Date - 2022-01-11T22:57:35+05:30 IST
జీవో 317 దంపతులను విడదీసిందని వైఎస్ షర్మిల అన్నారు. సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని మండిపడ్డారు. 9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: జీవో 317 దంపతులను విడదీసిందని వైఎస్ షర్మిల అన్నారు. సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని మండిపడ్డారు. 9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా 317 జీవోను మాత్రం రద్దు చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలను తీరుస్తారని చందాలు వేసి గెలిపించుకున్న ఉద్యోగ సంఘాలు... దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారని చెప్పారు. ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వడం చేతకాని సీఎం మనకొద్దన్నారు.