వైఎస్ ఇచ్చిన స్థలాన్ని జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

ABN , First Publish Date - 2020-06-07T00:30:02+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సెంట్ల స్థలాన్ని పేదలకు పంపిణీ చేశారు. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి..

వైఎస్ ఇచ్చిన స్థలాన్ని జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

అనంతపురం: గుంతకల్లులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సెంట్ల స్థలాన్ని పేదలకు పంపిణీ చేశారు. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమను అన్ని రకాలుగా ఆదుకుంటాడని నమ్మి గెలిపించుకున్నారు. అధికారం చేపట్టిన జగన్ తండ్రి ఇచ్చిన స్థలాన్ని అధికారులను అడ్డుపెట్టుకుని లాక్కుంటున్నారని నిరుపేదలు కన్నీరు పెడుతున్నారు. 


ఒక సెంటును పేదలకు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. కాగా పేదలు అప్పులు చేసి కడుపు కట్టుకుని నిర్మించుకున్న బేస్‌మేట్స్‌ను తొలగించి వాటినే సెంటు స్థలాలుగా లే అవుట్స్ వేస్తున్నారు. కడుపు మండిన నిరుపేదలు తమ స్థలాల్లో నిర్మించిన బేస్‌మేట్స్‌ను తొలగించరాదని, అక్కడే మూడు రోజులుగా కాపు కాస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


Updated Date - 2020-06-07T00:30:02+05:30 IST