ఏం ఉద్ధరించాడని గుడి కడుతున్నారు
ABN , First Publish Date - 2020-08-07T18:04:11+05:30 IST
కారణ జన్ములకు, మహాను భావులకు గతంలో ఆలయాలు కట్టేవారని..
మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
గోపాలపురం(పశ్చిమ గోదావరి): కారణ జన్ములకు, మహాను భావులకు గతంలో ఆలయాలు కట్టేవారని, రాష్ర్టాన్ని ఏమి ఉద్ధరించాడని ముఖ్యమంత్రి జగన్కి గుడులు, గోపురాలు కడుతున్నారో అర్థం కావడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మండి పడ్డా రు. మండలంలోని రాజంపాలెంకు చెందిన కాకర్ల హరే రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైలు జీవితం గడిపిన వ్యక్తికి ఆలయాలు కట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు.