జ్యోతిష్యం పేరుతో అత్యాచారం.. అతడికి బుద్ధి చెప్పేందుకు బాధితురాలు ఏం చేసిందంటే.. చివరకు అందరూ జైళ్లో..

ABN , First Publish Date - 2022-03-04T18:52:27+05:30 IST

ఆమె వివాహిత.. జైపూర్ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తోంది.. అక్కడే పని చేసే ఓ యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు..

జ్యోతిష్యం పేరుతో అత్యాచారం.. అతడికి బుద్ధి చెప్పేందుకు బాధితురాలు ఏం చేసిందంటే.. చివరకు అందరూ జైళ్లో..

ఆమె వివాహిత.. జైపూర్ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తోంది.. అక్కడే పని చేసే ఓ యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు.. నగ్నంగా ఉన్న ఫొటో ఇస్తే జ్యోతిష్యం చెబుతానన్నాడు.. దీంతో ఆ మహిళ తను నగ్నంగా ఉన్న ఫొటోను అతడికి పంపింది.. ఆ ఫొటో నెట్‌లో పెడతానని బెదిరించి ఆ యువకుడు ఆమెను అత్యాచారం చేశాడు.. దాంతో ఆ మహిళ తన భర్తతో కలిసి ఆ యువకుడిని కిడ్నాప్ చేయించి చితక్కొట్టించింది.. చివరకు అందరూ పోలీసులను ఆశ్రయించి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. 


రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో పనిచేస్తున్న బాధిత మహిళను జ్యోతిష్యం పేరుతో శుభమ్ అనే యువకుడు ట్రాప్ చేశాడు. నగ్న ఫొటో చూపిస్తే ఏ సమస్యకైనా తాను పరిష్కారం సూచిస్తానని చెప్పడంతో శుభమ్‌కు ఆ మహిళ తన న్యూడ్ ఫొటో పంపింది. ఆ ఫొటోను నెట్‌‌లో పెడతానని బెదిరించి ఆమెపై శుభమ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ఆ విషయం తన భర్తకు చెప్పింది. దీంతో అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి శుభమ్‌ను కిడ్నాప్ చేశాడు. 


ఒక రోజంతా శుభమ్‌కు తిండి పెట్టకుండా చితక్కొట్టాడు. గుండు గీయించాడు. చివరకు ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి కేసులు నమోదు చేసుకున్న పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-03-04T18:52:27+05:30 IST