యువత క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-01-24T06:31:07+05:30 IST

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి
ట్రోఫీ అందుకుంటున్న విన్నర్స్‌ నున్న జట్టు

గన్నవరం, జనవరి 23 : యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని సర్పంచ్‌ పులపాక బాబూరావు అన్నారు. మండలంలోని సూరంపల్లి వేణుగోపాలస్వామి క్రీడా ప్రాంగణంలో 20 రోజులుగా నిర్వ హిస్తున్న యంగ్‌ బాయ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగి సింది. మొత్తం 52 జట్లు పాల్గొనగా నున్న నవీన్‌ రెడ్డి సీసీ  జట్టు విన్నర్స్‌గా నిలిచి ట్రోఫీతో పాటు రూ.15వేలు నగదు బహుమతి అందుకున్నారు. రన్నర్‌గా కనసానపల్లి సీసీ నిలిచింది. ప్రథమ బహుమతిని పసుపులేటి సురేష్‌ జ్ఞాపకార్థం స్నేహితులు, ద్వితీయ బహుమతిని సర్పంచ్‌ బాబూ రావు బహూకరించారు. 48 మ్యాచ్‌లకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గొట్టిపూళ్ల రఘు బహూకరించారు. టోర్నమెంట్‌ నిర్వహణకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూ.10వేలు అందజేసినట్లు తెలిపారు. కందిమళ్ల రాఘవ, మహేష్‌, బుజ్జి, కార్తీక్‌, కిషోర్‌, నవీన్‌ రెడ్డి, జోషన్‌, రాజా, రాజేష్‌, మహేష్‌, జగ దీష్‌, మని, రోహిత్‌, రాఘవ, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:31:07+05:30 IST