చింతల్‌లో రాయలసీమ యువకుడి కిడ్నాప్‌

ABN , First Publish Date - 2020-09-21T07:55:58+05:30 IST

హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చింతల్‌లో ఆదివారం సినీ పక్కీలో జరిగిన కిడ్నాప్‌ స్థానికంగా కలకలం

చింతల్‌లో రాయలసీమ యువకుడి కిడ్నాప్‌

డబ్బుల విషయంలో తగాదాలే కారణం 


జీడిమెట్ల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చింతల్‌లో ఆదివారం సినీ పక్కీలో జరిగిన కిడ్నాప్‌ స్థానికంగా కలకలం రేపింది. రాయలసీమకు చెందిన కొందరు వ్యక్తులు.. భార్య తో కలిసి గుడికి వెళ్లి వస్తున్న వ్యక్తిని చితకబాది, బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుపోయారు. వివరాలిలావున్నాయి. అనంతపురం జిల్లా అంపాపురం గ్రామానికి చెందిన ముఖేశ్‌ నాయుడు (27) సివిల్‌ కాంట్రాక్టర్‌. ఆయనకు అనంతపురం జిల్లా కప్పలబండి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణతో డబ్బుల విషయంలో తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ తన భార్య వాణితో కలిసి నగరానికి వచ్చి చింతల్‌లో నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం గుడికి వెళ్లడానికి భార్యతో కలిసి ముఖేశ్‌ బయటకు వచ్చాడు. రోడ్డుపైకి రాగానే నలుగురు వ్యక్తులతో కాపుకాసిన లక్ష్మీనారాయణ.. ముఖేశ్‌పై దాడి చేసి, బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-09-21T07:55:58+05:30 IST