యువత భవిష్యత్తు నాశనం చేసిన జగన్‌

ABN , First Publish Date - 2022-08-08T06:17:58+05:30 IST

యువత భవిష్యత్తు నాశనం చేసిన జగన్‌

యువత భవిష్యత్తు నాశనం చేసిన జగన్‌
రజకులకు ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేస్తున్న గద్దె రామ్మోహన్‌

పటమట, ఆగస్టు 7 : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన చేతకాని పాలనతో యువత భవిష్యత్తును నాశనం చేశారని  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. ఆదివారం ఉదయం అశోక్‌నగర్‌లోని తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యా లయంలో వివిధ డివిజన్‌లలోని నిరుపేద కుటుం బాలకు చెందిన రజకులకు రూ. 42 వేలు విలువ చేసే ఆరు ఇస్త్రీ పెట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో యువత ఉద్యోగాలు చేసుకుంటూ బిజీగా ఉండే వారన్నారు. ప్రస్తుత జగన్‌ పాలనలో ఉపాధి మార్గాలు నిర్వీర్యం అయి, ఉద్యోగాలు లేక యువత వ్యసనాల బారిన పడుతున్నారన్నారు.  రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు రావటం లేదని విమర్శించారు.    అభ్యుదయ రజక సంఘం రాష్ట్ర నాయకులు వల్లూరు మధుసూదనరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 24 లక్షల మంది రజకులు ఉన్నారని, వారిలో కనీసం పది శాతం మందికి కూడా జగన్‌ ప్రభుత్వం భరోసా పథకాన్ని అందించలేదన్నారు.  గద్దె తూర్పు నియోజకవర్గంలోని రజకులకు ఉపాధి మార్గాలను  తన సొంత నిధులతో  చూపిస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు.    గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌ షాపులో కుర్చీలు, వాయిద్య పరికరాలు, రజకులకు వాషింగ్‌ మిషన్‌లు, ఇస్త్రీ పెట్టెలతో పాటు చేతి వృత్తుల వారందరికి అనేక రకాల పరికరాలు అందించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, చెన్నుపాటి ఉషారాణి, అబ్దుల్‌ ఖాలీక్‌, మల్లెల రామకృష్ణ, మెరకనపల్లి నాగేశ్వరరావు, మాదల చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T06:17:58+05:30 IST