విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-08-14T05:36:16+05:30 IST
కొండాపురం గ్రామానికి చెందిన భోగి సాయి(22) విద్యుదాఘా తంతో మృతిచెందాడు.
పాలకొండ: కొండాపురం గ్రామానికి చెందిన భోగి సాయి(22) విద్యుదాఘా తంతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయి శుక్రవారం రాత్రి సెకెండ్ షో సినిమాకి వెళ్లి వచ్చి ఇంటి వద్ద మోటర్ పక్కనే ఉన్న ట్యాప్ను ఇప్పి కాళ్లు కడుక్కొనేందుకు సిద్ధమవ్వగా, విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరావు, శాంతిలకు పెద్ద కుమారుడైన సాయి ఆర్టీసీ డిపో ఎదురుగా ఓ చిన్నపాటి టిఫిన్ కొట్టు నడుపుతూ వారికి చేదోడువాదో డుగా ఉంటున్నాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.