మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెను చంపేందుకు ఎలాంటి ప్లాన్ వేశాడంటే.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-12T17:48:43+05:30 IST

ఆ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు.. ఒంటరిగా ఉన్న ఆ మహిళ తన గ్రామానికే చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది..

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెను చంపేందుకు ఎలాంటి ప్లాన్ వేశాడంటే.. చివరకు..

ఆ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు.. ఒంటరిగా ఉన్న ఆ మహిళ తన గ్రామానికే చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అతడికి కారు కూడా కొనిచ్చింది.. అతడు ఆమెను చంపేసి ఆస్థి మొత్తం దక్కించుకోవాలనుకున్నాడు.. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.. కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయాడు. 


హర్యానాలోని హిసార్‌కు చెందిన మాయా దేవి అనే మహిళ భర్త కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత సురేష్ కుమార్ అనే వ్యక్తితో మాయా దేవి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడికి కారు కూడా కొనిచ్చింది. పిల్లలు లేకపోవడంతో మాయా దేవి ఆస్థిపై సురేష్ కుమార్ కన్నేశాడు. ఆమెను చంపేస్తే ఆస్థి అంతా తన సొంతమైపోతుందనుకున్నాడు. ఆదివారం సాయంత్రం మాయా దేవిని తీసుకుని సురేష్ కుమార్ గుడికి వెళ్లాడు. 


తిరిగి వచ్చే సమయంలో రాత్రి ఏడు గంటలకు గ్రామం వెలుపల ఉన్న ఓ కెనాల్‌లోకి కారును పోనిచ్చాడు. చివరి నిమిషంలో తలుపు తీసుకుని సురేష్ దూకేశాడు. అక్కణ్నుంచి పారిపోయాడు. కారు వేగంగా కెనాల్‌లోకి దూసుకుపోయింది. అయితే కెనాల్‌లో నీరు పెద్దగా లేకపోవడంతో మాయా దేవి స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సురేష్ కుమార్‌పై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-12T17:48:43+05:30 IST