ఆరేళ్ల పగ.. తల్లిదండ్రుల మరణానికి కారణమైన వ్యక్తిని కిరాతకంగా కడతేర్చాడు. పోలీసులకు ఎలా దొరికాడంటే..

ABN , First Publish Date - 2022-02-27T05:40:33+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌కు చెందిన హీరాలాల్ అనే రైతు ఇటీవల హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికి ఆ గ్రామంలో శత్రువైన ప్రధాన్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతనికి, ఈ హత్యకు సంబంధం లేదని తెలిసి లోతుగా విచారణ జరిపారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. బంధువుల యువకుడే...

ఆరేళ్ల పగ.. తల్లిదండ్రుల మరణానికి కారణమైన వ్యక్తిని కిరాతకంగా కడతేర్చాడు. పోలీసులకు ఎలా దొరికాడంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌కు చెందిన హీరాలాల్ అనే రైతు ఇటీవల హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికి ఆ గ్రామంలో శత్రువైన ప్రధాన్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతనికి, ఈ హత్యకు సంబంధం లేదని తెలిసి లోతుగా విచారణ జరిపారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. బంధువుల యువకుడే ఆ రైతను కిరాతకంగా చంపాడని తేలింది. ఆరేళ్ల పగ మనసులో పెట్టుకుని ఆ యువకుడు ఈ హత్యకు పాల్పడ్డాడని బయటపడింది. 


వివరాల్లోకి వెళితే.. హీరాలాల్ అనే రైతు గత మంగళవారం తన పొలంలో హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చెందిన ప్రధాన్ అనే వ్యక్తిని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతడు నిర్దోషి అని తేలింది. దీంతో ఆ కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. మృతుడు హీరా లాల్ బంధువు రణ్‌వీర్ ఈ హత్య చేశాడని తేలింది.


గతంలో హీరాలాల్‌కు రణ్‌వీర్ తల్లికి మధ్య వివాహేతర సంబంధం ఉండేది. ఆ విషయం తెలియడంతో రణ్‌వీర్ తండ్రి భార్యను హత్య చేశాడు. తర్వాతి రోజు తను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచి హీరాలాల్‌పై రణ్‌వీర్ పగ పెంచుకున్నాడు. సరైన సమయం కోసం ఆరేళ్లు ఎదురు చేశాడు. చివరకు గత మంగళవారం రాత్రి హీరాలాల్‌ను చంపేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.  

Updated Date - 2022-02-27T05:40:33+05:30 IST