స్నేహితుడిని నమ్మి ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లడమే ఆమె చేసిన తప్పు.. తర్వాత ఆమె ఎంత నరకం చూసిందంటే..

ABN , First Publish Date - 2022-03-11T19:58:30+05:30 IST

ఆమె తన స్నేహితుడు పిలిస్తే ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లింది.. అక్కడ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత ఆ యువకుడు ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు..

స్నేహితుడిని నమ్మి ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లడమే ఆమె చేసిన తప్పు.. తర్వాత ఆమె ఎంత నరకం చూసిందంటే..

ఆమె తన స్నేహితుడు పిలిస్తే ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లింది.. అక్కడ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత ఆ యువకుడు ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీశాడు.. ఆ వీడియోను స్నేహితులకు పంపించాడు.. వారు కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి తమ వాంఛ తీర్చుకున్నారు.. అలా పలువురు స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.. రాజస్థాన్‌లోని చురులో ఈ ఘటన జరిగింది. 


చురులోని కొత్వాలి ప్రాంతానికి చెందిన యువతిని ఆరు నెలల క్రితం ఆమె స్నేహితుడు ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తీసుకెళ్లాడు. ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే వీడియో లీక్‌ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపాడు. వారిద్దరూ కలిసి కూడా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఆ తర్వాత మరో నలుగురు యువకులు కూడా ఆ వీడియో చూపించి బెదిరించి బాధితురాలిని అత్యాచారం చేశారు. ఆ బాధ భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో ముభావంగా ఉండడంతో తల్లి ఆమెను నిలదీసింది. దీంతో ఆ యువతి తన తల్లికి విషయం మొత్తం చెప్పింది. అనంతరం తల్లి సహాయంతో మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  


Updated Date - 2022-03-11T19:58:30+05:30 IST