టీడీపీ అభివృద్ధిలో యువతే కీలకం

ABN , First Publish Date - 2021-10-14T05:11:18+05:30 IST

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే యువత కీలకమని అరకు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

టీడీపీ అభివృద్ధిలో యువతే కీలకం
కార్యవర్గాన్ని ప్రకటిస్తున్న సంధ్యారాణి

 పార్టీ అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు సంధ్యారాణి

  తెలుగు యువత కార్యవర్గం ఎంపిక

సాలూరు రూరల్‌/ పార్వతీపురం/ గరుగుబిల్లి: తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే యువత కీలకమని అరకు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆమె తన నివాసంలో బుధవారం అరకు పార్లమెంటరీ తెలుగు యువత కార్యవర్గాన్ని ప్రకటించారు. అరకు పార్లమెంటరీ టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా వారాడ సుమంత్‌నాయుడు(పాలకొండ), ప్రధాన కార్యదర్శిగా నరంజి ప్రసాద్‌ (అరకు)లను ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా వి.రమణ, జె.రవి కుమార్‌, కె.సుమన్‌, పి.రాంబాబు, వి.చందు, అధికార ప్రతినిధులుగా డి.కృష్ణ, జి.రంజి త్‌కుమార్‌, కేవీజీ ప్రదీప్‌, కె.శ్రావణ్‌కుమార్‌లను ఎంపికచేశారు. కార్యనిర్వాహణ కార్య దర్శులుగా బి.అశోక్‌, ఎ.వెంకటరమణ, బి.భానోజీరావు, కె.గణేష్‌, ఎం.వీరభద్రరెడ్డి, ఎన్‌. చంద్రశేఖర్‌, ఎస్‌.బాలు, కార్యదర్శులుగా టి.వరప్రసాద్‌, బి.సాయిరాం, కె.శ్రీనుబాబు, కె.నారాయణరావు, జి.మురళి, బి.మధుసూదనరావు, బి.సత్యనారాయణ, టి.శ్రీను లను ఎంపిక చేశారు. నియోజకవర్గ అధ్యక్షులుగా సాలూరుకు రెడ్డి ఎర్రినాయుడు, అరకుకు సీకరి వెంకటేష్‌, పాడేరుకు వర్తాస నీలకంఠం, పాలకొండకు పారిశర్ల వెంక టరమణ, పార్వతీపురంనకు చందక దేశాలు, కురుపాంకు వావిపల్లి దివాకర్‌, రంప చోడవరానికి మఠం భాస్కరరావులను ఎంపిక చేశారు. మీడియా కోఆర్డినేటర్‌గా కిల్లో దయానిధి, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా ముప్పాన డింభకేశ్వరరావులను ఎంపిక చేశారు. 

   శృంగవరపుకోట రూరల్‌: శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ యువ కమిటీని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ, పార్టీ మండల అధ్యక్షుడు జీఎస్‌. నాయుడు బుధవారం ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా వాకాడ బాల ఈశ్వర్‌భరత్‌, ఉపాధ్యక్షులుగా కోళ్ల భూపాల్‌ నాయుడు, మూకల అప్పలనాయుడు, కాండ్రేగుల సంతోష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా కిలపర్తి ముత్యాలనాయుడు, సవరాల అనిల్‌ కుమార్‌, గన్ను శ్రీను తదితరులను ఎంపిక చేశారు.  


 

Updated Date - 2021-10-14T05:11:18+05:30 IST