చెరువలో పడి యువకుడు, బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-06-13T05:39:17+05:30 IST
కొయ్యలగూడెం మండలం గవర వరం గ్రామంలో చెరువలో పడి ఒక యువకుడు, ఒక బాలుడు మృతి మృతి చెందారు.
కొయ్యలగూడెం, జూన్ 12: కొయ్యలగూడెం మండలం గవర వరం గ్రామంలో చెరువలో పడి ఒక యువకుడు, ఒక బాలుడు మృతి మృతి చెందారు. శనివారం గ్రామానికి కరుటూరి మంగబాబు (19), అక్కల హర్షవర్థన్ (10) గ్రామంలోని అక్కిశెట్టివారి చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లారు. హర్షవర్థన్ చెరువులో ఊబిలోకి కూరుకుపోతుంటే పక్కనే ఉన్న మంగబాబు రక్షించేందుకు తానూ చెరు వులోకి దిగాడు. దీంతో ఊబిలో ఇరుక్కుని మునిగి పోయి మృతి చెందారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే వారు ప్రాణాలు కొల్పోయారు. మంగబాబు 10వ తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం కూలిపనికి వెళ్తున్నాడు. హర్షవర్థన్ నాల్గవ తరగతి చదువుతున్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వచ్చి బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై కే.సతీష్ కుమార్ తెలిపారు.