రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న యువకులు..
ABN , First Publish Date - 2022-02-15T13:11:59+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం లక్ష్మి థియేటర్ సమీపంలో ...
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం లక్ష్మి థియేటర్ సమీపంలో యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. అంతకుముందు ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు కానీ.. ఒక్కసారిగా రెండు గ్రూపులుగా విడిపోయి యువకులు రోడ్డుపై కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. యువకులను చెదరగొట్టారు. దీంతో ఆగ్రహించిన యువకులు ఆర్టీసీ బస్సుకు అడ్డుగా పడుకుని రచ్చ రచ్చ చేశారు. ఆందోళన చేస్తున్న యువకులందర్నీ పోలీసులు స్టేషన్కు తరలించారు.