కాకినాడ టు విశాఖపట్నం సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2020-11-25T06:50:16+05:30 IST

కాకినాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మంగళవారం కాకినాడ నుంచి విశాఖపట్నం సైకిల్‌ యాత్ర చేశారు.

కాకినాడ టు విశాఖపట్నం సైకిల్‌ యాత్ర
సైకిల్‌ యాత్ర చేస్తున్న యువకులు

ఇద్దరు యువకుల సైకిల్‌ యాత్ర


కశింకోట, నవంబరు 24: కాకినాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మంగళవారం కాకినాడ నుంచి విశాఖపట్నం సైకిల్‌ యాత్ర చేశారు. కాకినాడ ఓఎన్‌జీసీలో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్న రాజత్‌, అక్వా యూనిట్‌ నిర్వాహకుడు గోపాల్‌రాజ్‌ సైకిల్‌పై విశాఖకు వచ్చారు. తిరిగి విశాఖ నుంచి కాకినాడకు వెళ్తూ దారిలో కశింకోట వద్ద కనిపించారు. కాకినాడ నుంచి విశాఖ రాకపోకలకు 300 కిలోమీటర్లు దూరం ఉందని, ఒక రోజులోనే లక్ష్యాన్ని పూర్తిచేసినట్టు చెప్పారు. ‘టుడే 100 పోగ్రామ్‌’లో భాగంగా రోజు తప్పించి రోజు 300 కిలోమీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేస్తున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమం అక్టోబరు 21 ప్రారంభించామని, వచ్చే ఏడాది జనవరి 20 వరకు కొనసాగుతుందని చెప్పారు.  


Updated Date - 2020-11-25T06:50:16+05:30 IST