ఏలూరులో ఎస్సైపై ఆకతాయిల దాడి

ABN , First Publish Date - 2020-10-30T22:48:17+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏఆర్ ఎస్సైపై కొందరు ఆకతాయిలు దాడికి దిగారు.

ఏలూరులో ఎస్సైపై ఆకతాయిల దాడి

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏఆర్ ఎస్సైపై కొందరు ఆకతాయిలు దాడికి దిగారు. త్రీటౌన్ పీఎస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. బాలికను వేధించిన ఆకతాయిలను ఎస్సై స్టేషన్‌కు రప్పించి మందలించారు. అయితే ఆ ఆకతాయిలు తీవ్ర ఆగ్రహంతో ఎస్సైపై ఎదురుదాడికి దిగారు. బాలిక, ఏఆర్ ఎస్సై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారు అధికార పార్టీ ప్రజాప్రతినిధికి అనుచరులుగా పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఎస్సైపై దాడి జరిగిందని తెలుసుకున్న ఏఆర్ సిబ్బంది పెద్ద ఎత్తున త్రీటౌన్ పీఎస్‌కు చేరుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఇంతకీ ఎవరు..!?

ప్రస్తుతం ఇద్దరు యువకులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని విచారించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? అనేదానిపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని త్రీటౌన్ పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఘటనకు పాల్పడిన ఆకతాయిలు ఎవరు..? వారు ప్రజాప్రతినిధి అనుచరులే అయితే ఇంతకీ ఆ నేత ఎవరు..? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పశ్చిమ గోదావరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా ముందుకెళ్తారా అని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-10-30T22:48:17+05:30 IST