ఫేస్బుక్లో పరిచయం చేసుకుని...
ABN , First Publish Date - 2021-06-17T13:42:27+05:30 IST
ఆమెతో చాటింగ్ చేసిన అతడు వాట్సాప్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత తరచూ మాట్లాడుతూ కలుస్తుండేవాడు...
హైదరాబాద్ సిటీ : ఫేస్బుక్లో పరిచయం అయిన బాలికను లైంగికంగా వేధించిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్కు చెందిన చింత ప్రశాంత్కు ఫేస్బుక్లో ఓ బాలిక పరిచయం అయింది. కొంతకాలంపాటు ఆమెతో చాటింగ్ చేసిన అతడు వాట్సాప్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత తరచూ మాట్లాడుతూ కలుస్తుండేవాడు. ప్రేమిస్తున్నట్లు ఓ రోజు బాలికకు చెప్పాడు. ఆమె అతడి ప్రేమను తిరస్కరించి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. బాలికపై కక్ష పెంచుకున్న ప్రశాంత్ నకిలీ ఇన్స్టాగ్రామ్ సృష్టించి ప్రొఫైల్ పిక్గా బాలిక ఫొటో పెట్టి అసభ్య మెసేజ్లు, అభ్యంతరకర ఫొటోలు పోస్ట్ చేస్తున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.