భార్య చేతిపై పచ్చబొట్టు.. పక్కింట్లోని 22 ఏళ్ల యువతి పేరేనని గ్రహించిన భర్త.. చివరకు ఇంట్లో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-08-24T20:21:48+05:30 IST

రాఖీ పండుగ కోసం పుట్టింటికి వచ్చిందామె. పక్కింట్లో ఉండే వదిన వరుస అయ్యే మహిళతో ఆమెకు మంచి స్నేహం. వీళ్లిద్దరూ కలిసి రాఖీ పండుగ రోజు ఒకే ఫ్యానుకు ఉరేసుకొని మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

భార్య చేతిపై పచ్చబొట్టు.. పక్కింట్లోని 22 ఏళ్ల యువతి పేరేనని గ్రహించిన భర్త.. చివరకు ఇంట్లో షాకింగ్ సీన్..!

రాఖీ పండుగ కోసం పుట్టింటికి వచ్చిందామె. పక్కింట్లో ఉండే వదిన వరుస అయ్యే మహిళతో ఆమెకు మంచి స్నేహం. వీళ్లిద్దరూ కలిసి రాఖీ పండుగ రోజు ఒకే ఫ్యానుకు ఉరేసుకొని మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జరిగింది. ఈ ఇద్దరు మహిళలు వరుసకు వదిన-మరదలు అవుతారు. వీళ్ల పేర్లు పూనం(30), మంజు(20). వీళ్లిద్దరి మధ్య చాలా గట్టి స్నేహం. ఎంతలా అంటే పూనం.. మంజు పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. ఈ విషయంలో పూనం దంపతుల మధ్య గొడవలు కూడా జరిగేవి. వీళ్లకు పెళ్లి జరిగి సుమారు 7 ఏళ్లు దాటింది. ఇటీవలే మంజు పెళ్లి జరిగింది. జూన్ 20న మంజు పెళ్లి జరగడంతో ఆమె మెట్టింటికి వెళ్లింది. ఇటీవల రాఖీ పండుగ కోసం ఇంటికొచ్చిందామె.


అంతకుముందు రోజే పూనం చేతిమీద ఉన్న మంజు పచ్చబొట్టు విషయంలో పూనం దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాతి రోజే మంజును ఇంటికి పిలిచిన పూనం.. కాసేపు ముచ్చట్లు చెప్పింది. కాసేపటికి పూనం మావయ్య, భర్త బయటకు పాలు పితకడానికి వెళ్లారు. పూనం ఐదేళ్ల కొడుకు ఆడుకుంటున్నాడు. అతను కూడా బయటకు వెళ్లి ఆడుకొని, ఇంట్లోకి రాబోయాడు. చూస్తే తలుపులు లోపలి నుంచి గొళ్లెం వేసి ఉన్నాయి. తలుపులు ఎంత కొట్టినా, తల్లిని పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో ఆ పిల్లాడు వెళ్లి తండ్రికి, తాతకు విషయం చెప్పాడు. వాళ్లు వచ్చి గట్టిగా కేకలు వేసినా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన పూనం భర్త రాము.. మంజు వదిన ఆకాంక్షను పిలిచాడు.


ఆకాంక్ష కూడా వచ్చి తలుపులు కొట్టి మంజును పిలిచింది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో రాము, అతని తండ్రి కలిసి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. లోపలకు వెళ్లి చూస్తే పూనం, మంజు ఇద్దరూ ఒకే ఫ్యానుకు ఉరేసుకొని కనిపించారు. వారిని వెంటనే కిందకు దించి చూడగా.. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులకు ఈ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ వదిన-మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వీరి మధ్య ఎలాంటి బంధం ఉంది? వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-24T20:21:48+05:30 IST