విషాదం: పెద్దపులి దాడిలో యువతి మృతి

ABN , First Publish Date - 2020-11-29T21:33:30+05:30 IST

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల పులి దాడిలో

విషాదం: పెద్దపులి దాడిలో యువతి మృతి

ఆసిఫాబాద్‌: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల పులి దాడిలో యువకుడి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్దపులి దాడిలో యువతి మృతిచెందింది. పంటచేనులో పత్తి ఏరుతుండగా యువతిపై అమాంతంగా పులి దాడి చేసి హతమార్చింది. పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి శివారులో ఈ ఘటన జరిగింది.


ఈ నెల 11న దహేంగా మండలం దిగిడలో కూడా పులి దాడిలో యువకుడి మరణించాడు. పులిని బంధించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పులి బారి నుంచి తమను రక్షించాలంటూ అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-11-29T21:33:30+05:30 IST