Americaలో చదివి 21 ఏళ్లకే లక్షల జీతంతో జాబ్.. కూతురి ఎదుగుదలతో మురిసిపోయిన తండ్రి.. ఇంతలోనే ఊహించని ఘోరం..!

ABN , First Publish Date - 2021-10-16T23:53:37+05:30 IST

ఆమెకు కేవలం 21 ఏళ్లే. కానీ.. చిన్న వయసులోనే ఆమె ఎంతో సాధించింది. అమెరికాలో చదువుకుని, సౌదీ అరేబియాలో ఉద్యోగం సంపాదించింది. ఆమె ఎదుగుదల చూసి తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కానీ.. ఇంతలో వారి కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది.

Americaలో చదివి 21 ఏళ్లకే లక్షల జీతంతో జాబ్.. కూతురి ఎదుగుదలతో మురిసిపోయిన తండ్రి.. ఇంతలోనే ఊహించని ఘోరం..!

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 21 ఏళ్లే. కానీ.. చిన్న వయసులోనే ఆమె ఎంతో సాధించింది. అమెరికాలో చదువుకుని, సౌదీ అరేబియాలో ఉద్యోగం సంపాదించింది. ఆమె ఎదుగుదల చూసి తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కానీ.. ఇంతలో వారి కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది. 


తమిళనాడుకు చెందిన  శ్యామా కనగసబాపతి(21) కొంతకాలం క్రితం ఉద్యోగం నిమిత్తం సౌదీకి వెళ్లింది. ఆ తరువాత తల్లిదండ్రులు కూడా ఆమె వద్దకు వెళ్లారు. అయితే.. రియాద్‌లో మంగళవారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో అనంతమైన విషాదం నింపింది. ఈ క్రమంలో శ్యామా, ఆమె తల్లి మాలార్ సెల్వి ఘటనా స్థలంలోనే మరణించారు. తండ్రి కనగసబాపతి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుటుంబమంతా కలిసి  కారులో రియాద్ నుంచి దమ్మామ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. శ్యామా చదువుకున్న కంకార్డియా కాలేజీలో(న్యూయార్క్) ఈ ఉదంతం విషాదం నింపింది. కాలేజీకి చెందిన స్ట్రాటజిక్ ఇనీషియేటివ్ విభాగం ఉపాధ్యక్షుడు లింక్డిన్ వేదికగా తన సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-10-16T23:53:37+05:30 IST