ఆడ్మిన్‌ కార్యదర్శిపై వలంటీర్‌ దాడి

ABN , First Publish Date - 2021-10-19T05:07:16+05:30 IST

పురపాలక పరిధి 8వ వార్డు సచివాలయంలో ఆడ్మిన్‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఇషాక్‌బాబుపై రామాంజినేయులు అనే వలంటీరు మరి కొందరితో కలసి దాడి చేశాడు.

ఆడ్మిన్‌ కార్యదర్శిపై వలంటీర్‌ దాడి
ఇషాక్‌బాబు

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 18 : పురపాలక పరిధి 8వ వార్డు సచివాలయంలో ఆడ్మిన్‌ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఇషాక్‌బాబుపై రామాంజినేయులు అనే వలంటీరు మరి కొందరితో కలసి దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... ఫీవర్‌ సర్వే విషయంలో వలంటీర్‌ రామాంజినేయులు సర్వే చేయకపోవడంపై సదరు వార్డు సచివాలయ ఆడ్మిన్‌ కార్యదర్శి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీంతో రామాంజినేయులు మరి కొందరితో కలిసి అడ్మిన్‌ కార్యదర్శిపై దాడి చేసి గాయపరిచాడన్నారు. బాధితుడు ఇషాక్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టుటౌన్‌ ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ తెలిపారు. 

 

Updated Date - 2021-10-19T05:07:16+05:30 IST