యువరైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-14T06:11:33+05:30 IST

పెళ్లి కాలేదని మనస్తాపంతో మండల పరిధిలోని మాయదార్లపల్లికి చెందిన యువరైతు మంజు (23) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

యువరైతు ఆత్మహత్య

పెళ్లి కాకపోవడమే కారణం

కుందుర్పి, ఆగస్టు 13: పెళ్లి కాలేదని మనస్తాపంతో మండల పరిధిలోని మాయదార్లపల్లికి చెందిన యువరైతు మంజు (23)  శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు, మాయదార్లపల్లికి చెందిన సన్న మల్లమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పెద్దన్న పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు. తల్లి వద్ద చిన్న కుమారుడు ఉంటున్నాడు. వీరికి వ్యవసాయంతో పాటు గొర్రెలు ఉన్నాయి. మంజుకు గత సంవత్సరం నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎక్కడా కుదరలేదు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. తనకు పెళ్లికాదేమోనన్న మనోవేదనతో పొలంలో చింత చెట్టుకు శుక్రవారం రాత్రి ఉరివేసుకున్నాడు. గొర్రెల కాపరులు గమనించి తల్లికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. 

Updated Date - 2022-08-14T06:11:33+05:30 IST