మెట్టవలసలో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-14T05:37:47+05:30 IST
గొట్టూరు పంచాయతీ మెట్టవలస గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య చేసుకుంది.
పాచిపెంట: గొట్టూరు పంచాయతీ మెట్టవలస గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచే సుకుంది. ఎస్ఐ ఎం.వెంకటరమణ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్ కొదంజిగూడ గ్రామానికి చెందిన పాంగి స్నేహలత(27), పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ మెట్టవలసకు చెందిన కొర్ర సోనియా అనే వ్యక్తిని ప్రేమిం చింది. ప్రేమలో పడిన తర్వాత ఆమె సోనియా ఇంటి వద్దనే ఉంటూ గత కొన్నే ళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండే వారని గ్రామస్థులు, వారి తల్లిదండ్రులు తెలిపారు. అయితే ప్రాథమిక విచారణలో భాగంగా వారి మధ్య మనస్పర్థల కారణంగా ఆమె ఉరి వేసుకుని ఉండవచ్చునని ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు సీహెచ్సీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.