పోలీస్‌స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-03-01T21:31:19+05:30 IST

పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం

పోలీస్‌స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. జిల్లాలోని ఇళ్లందకుంట మండల పోలీస్‌స్టేషన్ ఎదుట ఆ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిట్యాల సంధ్య, కేశవపట్నం మండలం ఎప్పలపల్లి గ్రామానికి చెందిన అన్నేసంతోష్ అనే యువకుడు ప్రేమించికుని పెళ్ళి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో గ్రామ పెద్దలు అభ్యంతరం తెలిపారు. దీంతో గ్రామ పెద్దమనుషులు వీరి కులాంతర వివాహంపై పంచాయతీ పెట్టించారు. సాఫీగా సాగిపోతున్న తమ కాపురంలో తనది వేరే కులం అంటూ గ్రామ పెద్దలు కాపురంలో విభేదాలు సృష్టించారని బాధిత యువతి ఆవేదన చెందింది. ఈ అవమానాన్ని భరించలేక యువతి ఇళ్లందకుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడ ఉన్నవారు వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-01T21:31:19+05:30 IST