యువతి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-01-17T06:06:32+05:30 IST

పేరుతో వెంటపడ్డాడు. ప్రేమించాలని వేధించాడు. వరుసకు సోదరుడు కావడంతో బయటకు చెప్పలేక.. లోలోపల కుమిలిపోయిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. రేగిడి మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో

యువతి ఆత్మహత్య!




రేగిడి, జనవరి 16: ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ప్రేమించాలని వేధించాడు. వరుసకు సోదరుడు కావడంతో బయటకు చెప్పలేక..  లోలోపల కుమిలిపోయిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. రేగిడి మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.సంతకవిటి మండలానికి చెందిన విద్యార్థిని పాలకొండలోని ఓ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రేగిడి మండలంలోని ఓ గ్రామంలో తాతగారింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వరుసకు సోదరుడైన యువకుడు ప్రేమ పేరుతో వెంటపడేవాడు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. ఇటీవల ఆ యువకుడి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తాళలేక ఆ యువతి శుక్రవారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని కుటుంబసభ్యులు రాజాం కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. శనివారం మృతదేహానికి రాజాం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ తెలిపారు. పాలకొండ డీఎస్పీ శ్రావణి ఘటన జరిగిన గ్రామాన్ని సందర్శించారు.

Updated Date - 2021-01-17T06:06:32+05:30 IST