HYD : పూటుగా తాగొచ్చి తల్లితో గొడవ.. తెల్లారేసరికి..!

ABN , First Publish Date - 2021-10-24T14:48:05+05:30 IST

మద్యం తాగొచ్చి తల్లితో గొడవ పడ్డాడు. గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత...

HYD : పూటుగా తాగొచ్చి తల్లితో గొడవ.. తెల్లారేసరికి..!

హైదరాబాద్ సిటీ/మదీన : చాంద్రాయణగుట్ట పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ అహ్మద్‌ కుమారుడు సయ్యద్‌ నయీమ్‌ (23) లేబర్‌ పనిచేస్తుంటాడు. తల్లీ కొడుకు ఉంటారు. నయీమ్‌ తాగుడుకు బానిసై పనికి సరిగ్గా వెళ్లేవాడు కాదు. దీంతో తల్లీకొడుకు గొడవ పడేవారు. ఈనెల 22న కూడా మద్యం తాగొచ్చి తల్లితో గొడవ పడ్డాడు. గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత కొడుకు గదిలోనుంచి బయటికి రాకపోవడంతో తల్లి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-24T14:48:05+05:30 IST