రికవరీ ఏజెంట్ల వేధింపులతో యువకుడి Suicide

ABN , First Publish Date - 2022-07-08T16:14:54+05:30 IST

నగరంలోని అత్తాపూర్‌లో యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది.

రికవరీ ఏజెంట్ల వేధింపులతో యువకుడి Suicide

రాజేంద్రనగర్‌: నగరంలోని అత్తాపూర్‌ (Attapur)లో యువకుడు ఆత్మహత్య(Suicide) కలకలం రేపుతోంది. క్రెడిట్‌ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక దత్తాత్రేయ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దత్తాత్రేయ  రెండేళ్లుగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసయ్యారు. అతని వద్ద ఉన్న మూడు క్రెడిట్‌ కార్డుల్లోని డబ్బులతో యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. దీంతో క్రెడిట్ కార్డు డబ్బు కట్టాలంటూ దత్తాత్రేయపై రీకవరీ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువచ్చారు. రికవరీ ఏజెంట్ల వేధింపులతో తీవ్ర మనస్థాపం చెందిన దత్తాత్రేయ ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని తనను వేధిస్తున్నారని యువకుడు సూసైడ్‌ లెటర్ రాశాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటానాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-07-08T16:14:54+05:30 IST