ప్రియురాలి మృతితో మనస్తాపం
ABN , First Publish Date - 2022-08-19T06:07:33+05:30 IST
ప్రియురాలు ఆనారోగ్యంతో మృతిచెందగా మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు
యువకుడి బలవన్మరణం
చిల్లకూరు, ఆగస్టు 18 : ప్రియురాలు ఆనారోగ్యంతో మృతిచెందగా మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మారప్ప(26), జమున(16) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో రెండురోజుల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. జమునకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకురాగానే జమున మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురైన మారెప్ప గుళికల మందు తిని మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.