రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-27T12:14:50+05:30 IST
ఆదోని-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ 493/11-13 నంబర్ సమీపంలో బుధవారం కురువ వీరేష్ (21) రైలు కింద పడి
కర్నూలు: ఆదోని-నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ 493/11-13 నంబర్ సమీపంలో బుధవారం కురువ వీరేష్ (21) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భవన నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆయన మనస్తాపంతో ఉన్నాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుబ్బారాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.