మచిలీపట్నం: బీచ్లో యువకుడు గల్లంతు అయ్యారు. దీంతో యువకుడి కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైన యువకుడిని హినీత్ కుమార్గా గుర్తించారు. ఇవాళ అదివారం కావడంతో ఐదుగురు యువకులు సరదాగా సముద్రంలోకి ఈతకు దిగారు. ఈ సమయంలో ఒక్కసారిగా యువకులంతా సముద్రంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు నలుగురు యువకులను రక్షించారు. మరో యువకుడి కోసం సముద్రంలో గాలిస్తున్నారు.