గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-14T04:46:27+05:30 IST

కాశీపేట సమీపంలో 36వ రాష్ర్టీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

సీతానగరం, మే 13:  కాశీపేట సమీపంలో 36వ రాష్ర్టీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. కాశీపేట గ్రామానికి చెందిన గుంప అజయ్‌(17)  గురువారం 36వ రాష్ర్టీయ రహదారి వైపు బహిర్భూమికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో గాయాలపాలైన యువకుడిని స్థానికులు గుర్తించి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి తల్లి లక్ష్మి ఉంది. అజయ్‌ పుట్టకతో మూగవాడు. ఈ సంఘటనపై ఎస్‌ఐ బి.మురళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 


Updated Date - 2021-05-14T04:46:27+05:30 IST