రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-10-20T06:29:07+05:30 IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన కంభం శ్రీకాంత్‌రెడ్డి(26) మిర్యాలగూడ నుంచి నేరేడుచర్లకు బైక్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేస్తున్న స

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నేరేడుచర్ల, అక్టోబరు 19: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన కంభం శ్రీకాంత్‌రెడ్డి(26) మిర్యాలగూడ నుంచి నేరేడుచర్లకు బైక్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేస్తున్న సమయంలో నేరేడుచర్లలోని ఓ మిల్లు వద్ద గుంతను గమనించపో వడంతో గుంతలోకి వెళ్లి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడిపోయాడు. బస్సు తల మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-20T06:29:07+05:30 IST