రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-06-15T06:19:41+05:30 IST
మండల కేంద్రంలోని కదిరిరోడ్లో ద్విచక్రవాహ నం అదుపు తప్పి కిందకుపడి ఓ యు వకుడు సోమవారం మృతిచెందాడు.
ముదిగుబ్బ,జూన 14: మండల కేంద్రంలోని కదిరిరోడ్లో ద్విచక్రవాహ నం అదుపు తప్పి కిందకుపడి ఓ యు వకుడు సోమవారం మృతిచెందాడు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు....కదిరి మండలం సున్నపగుట్టప ల్లి తండాకు చెందిన దేవేందర్నాయక్ (30) కదిరివైపు నుంచి ద్విచక్రవాహనం లో ముదిగుబ్బకు వస్తుండగా ముదిగు బ్బ సమీపంలోని డాబావద్ద ద్విచక్రవాహ నం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్ర మాదంలో దేవేందర్నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108సిబ్బందికి సమాచారం అందించడంతో వారు గాయపడిన వ్యక్తిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృ తునికి భార్య శాంతాబాయ్, కుమారుడు, కుమార్తెలున్నారు. మృతుడు బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ పెద్ద కోల్పో వడంతో భార్య,పిల్లలు, బంధు వులు బోరున వివరించారు. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.