రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-04-13T05:52:54+05:30 IST
తూర్పునౌకదళం సమీపంలోని ఐఎన్ఎస్ సర్కార్ వద్ద సోమవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యానాపు కార్తీక్ కుమార్ (21) మృతి చెందా డు.
మల్కాపురం, ఏప్రిల్ 12: తూర్పునౌకదళం సమీపంలోని ఐఎన్ఎస్ సర్కార్ వద్ద సోమవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యానాపు కార్తీక్ కుమార్ (21) మృతి చెందా డు. జనతాకాలనీ శివారు ఇందిరాకాలనీలో తల్లి భవా ని, అమ్మమ్మతో కలిసి ఉం టున్న కార్తీక్ షీలానగర్ గెయిల్ కంపెనీలో పైప్లైన్ టెస్టింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా డు. నగరంలోకి వెళ్లేందుకు బయలుదేరిన కార్తీక్ ఐఎన్ఎస్ సర్కార్ వద్దకు వచ్చేసరికి ఇండియన్ నేవీకీ చెందిన ఓ ట్రక్ వెనుకనుంచి బలంగా ఢీకొనడంతో ఆ వాహనం చక్రాల కిం ద నలిగిపోయాడు. వెంటనే ఆ వాహనం డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. కొంతమంది నేవల్ ఉద్యోగులు డ్రైవర్ను కారులో ఎక్కించుకొని మల్కాపురం వైపు తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు. ఈలోగా మల్కాపురం పోలీసులకు సమాచా రం అందించడంతో ఎస్ఐ మహాలక్ష్మి ఘటన స్థలానికి చేరు కుని డ్రైవర్ను స్టేషన్కు తరలించారు. సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆధా రమైన కార్తీక్ మృతితో తల్లి, అమ్మమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి మానసిక రోగి కావడం, తండ్రి చిన్నప్పుడే మృతిచెందడంతో ఆ కుటుంబానికి ఆధా రం లేకుండా పోయింది.