విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-20T06:55:36+05:30 IST
మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు మృత్యువాతపడ్డాడు.
మునుగోడురూరల్, అక్టోబరు 19: మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు మృత్యువాతపడ్డాడు. గ్రామస్థులు , కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన కంప సత్తయ్య -పార్వతమ్మ దంపతుల కుమారుడు మల్లేష్ (25)గ్రామంలోని పెద్ద రైతు పులిమామిడి ప్రభాకర్ రెడ్డి వద్ద ఆరు నెలలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. పొలం పనులతోపాటు అతనికి ఉన్న ఆవులను సాయంత్రం వరకు గ్రామానికి దూరంగా ఉన్న బావి వద్ద కట్టేసి వస్తుంటాడు. రోజూమాదిరే మంగళవారం సాయంత్రం 4గంటల వరకు గ్రామంలో ఉన్న మల్లేష్ ఆవులకు నీళ్లు తాపి వచ్చేందుకు వెళ్లి రాత్రి 8గంటలైనా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని వెతుక్కుంటూ ఆ బావి వద్దకు వెళ్లేసరికి ట్రాన్స్ఫా ర్మర్పై మృతిచెంది పడి ఉన్నాడు. ఆవు దూడను పట్టుకునేందుకు వెంబడించి ప్రమాద వశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి షాక్కు గురై మృతి చెంది ఉంటాడని పలువురు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.