విద్యుత్ ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-08-04T10:40:47+05:30 IST
మండలంలోని రాక్కుంటపల్లి గ్రామానికి చెందిన భూక్యా రామకృష్ణ నాయక్ (31) సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి ..
తనకల్లు, ఆగస్టు 3 : మండలంలోని రాక్కుంటపల్లి గ్రామానికి చెందిన భూక్యా రామకృష్ణ నాయక్ (31) సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బీఈడీ, టీటీసీ చదివిన రామకృష్ణనాయక్ తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉన్నాడు. అయితే బాత్రూమ్లో లైటు పడకపోవడంతో విద్యుత్ తీగల మరమ్మతు చేపట్టాడు. ఆ సమయంలో ప్రమాదం సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై తనకల్లు పోలీసులను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఇంతవరకు సమాచారం అందలేదని తెలిపారు.