ఇసుక లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-17T05:57:14+05:30 IST

రాజాం-చీపురుపల్లి రోడ్డులో గాయత్రికాలనీ వద్ద శుక్రవారం ఇసుక లారీ ఢీకొని యువకుడు కోరాడ శ్రీను (25) దుర్మరణం చెందాడు.

ఇసుక లారీ ఢీకొని యువకుడి మృతి

రాజాం రూరల్‌ : రాజాం-చీపురుపల్లి రోడ్డులో గాయత్రికాలనీ వద్ద శుక్రవారం ఇసుక లారీ ఢీకొని యువకుడు కోరాడ శ్రీను (25) దుర్మరణం చెందాడు. రాజాం ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణం గులువిందల అగ్రహారం వీధికి చెందిన కోరాడ శ్రీను తన స్నేహితుడు చింతపల్లి రాజుతో కలిసి ద్విచక్రవాహనంపై రాజాం వచ్చాడు. ఇక్కడ బ్యాంకు పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం వెనుకన కూర్చొన్న రాజు తుళ్లిపోగా, వాహనాన్ని నడుపుతున్న శ్రీను లారీ చక్రాల కిండపడి నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన రాజును తొలుత రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-04-17T05:57:14+05:30 IST