యువకుడి ప్రాణం తీసిన ఫొటోల మోజు

ABN , First Publish Date - 2020-08-05T04:10:54+05:30 IST

ఫొటోల మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖండాలజలపాతం వద్ద జరిగింది. ఇంద్రవెల్లికి చెందిన సచిన్ స్నేహితులతో...

యువకుడి ప్రాణం తీసిన ఫొటోల మోజు

ఆదిలాబాద్: ఫొటోల మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖండాలజలపాతం వద్ద జరిగింది. ఇంద్రవెల్లికి చెందిన సచిన్ స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లారు. ఫొటోలు దిగే క్రమంలో సచిన్ జలపాతంలో పడ్డాడు. సచిన్‌ను కాపాడాలని స్నేహితులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-05T04:10:54+05:30 IST