చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-17T05:11:18+05:30 IST
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
మేడ్చల్, మే 16: తండ్రితో గొడవపడిన ఓ కొడుకు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మండలం నూతన్కల్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మస్కూరి హరిప్రసాద్(18) ఆదివారం తన తండ్రితో గొడవపడ్డాడు. అనంతరం మనస్థాపంతో గ్రామ పెద్దచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. పోలీసులు ఆదివారం రాత్రి వరకూ గాలించినా మృతదేహం ల భ్యం కాలేదు. సోమవారం నీటిలో తేలింది. ఈ మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.