ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-17T04:25:26+05:30 IST
మనస్తాపానికి గురై యువకుడు మల్లేష్యాదవ్(27) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై చం ద్రయ్య సోమవారం తెలిపారు.
నాగర్కర్నూల్ క్రైం, మే 16: మనస్తాపానికి గురై యువకుడు మల్లేష్యాదవ్(27) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై చం ద్రయ్య సోమవారం తెలిపారు. నాగర్కర్నూల్ మునిసిపాలిటీ ఉయ్యాలవాడకు చెందిన మల్లేష్యాదవ్ తాను ప్రేమించిన యు వతి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట నపై మృతుని తండ్రి ఎంగం జంగయ్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చంద్రయ్య తెలిపారు.