రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-08T05:12:52+05:30 IST
ఎర్రగుడిపాడు - ఎర్ర గుంట్ల రైల్వేస్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే ఎస్ఐ కేఎస్ వర్మ తెలిపారు.
కడప(క్రైం), మార్చి 7: ఎర్రగుడిపాడు - ఎర్ర గుంట్ల రైల్వేస్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే ఎస్ఐ కేఎస్ వర్మ తెలిపారు. మృతుడికి 32-35 లోపు వయసు ఉంటుందని, బ్రౌన్ కలర్, బ్లాక్కలర్ లైన్స్ ఉన్న ఫుల్ షర్టు, బ్లూకలర్ జీన్స్ ఫ్యాంటు ధరించినట్లు తెలిపారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.