తొమ్మిదేళ్లుగా ప్రేయసి కోసం చేసిన ఖర్చునంతా రాసి మరీ ఓ ప్రియుడి దారుణం.. అతడి చివరి కోరిక చదివి విస్తుపోయిన పోలీసులు

ABN , First Publish Date - 2022-06-02T21:55:11+05:30 IST

ఓ యువకుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని భావించాడు. తన మనసులోని మాటను ఆమె వద్ద వ్యక్తపరిచాడు. ఆ యువతి కూడా అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అ

తొమ్మిదేళ్లుగా ప్రేయసి కోసం చేసిన ఖర్చునంతా రాసి మరీ ఓ ప్రియుడి దారుణం.. అతడి చివరి కోరిక చదివి విస్తుపోయిన పోలీసులు

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని భావించాడు. తన మనసులోని మాటను ఆమె వద్ద వ్యక్తపరిచాడు. ఆ యువతి కూడా అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అతడు ఎగిరి గంతేశాడు. చూస్తుండగానే ప్రేమలో ఇద్దరూ 9ఏళ్లు గడిపేశారు. తాజాగా వారి ప్రేమ ప్రయాణం అనూహ్య మలుపు తిరిగింది. ప్రేయసి నోటి నుంచి వచ్చిన ఒక్కమాటతో అతడు విస్తుపోయాడు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాకు చెందిన చేతన్(31) అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. దీంతో ఇరువురూ కలిసి ప్రేమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చేట్టపట్టాలేసుకుని తిరుగుతూ 9ఏళ్లు గడిపేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో డ్రైవర్‌గా పని చేస్తూ.. ప్రేయసి సరదాలు, సంతోషాల కోసం బాగానే ఖర్చు చేశాడు. అయితే తాజాగా ఆమె సంతోషాలు, సరదాలు అతడికి సమస్యగా మారాయి. కావాల్సిందల్లా తెచ్చి ఇచ్చేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే విషయాన్ని తన స్నేహితుల వద్ద చెప్పుకుని వాపోయాడు. ఈ క్రమంలోనే అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. సరదా తిరుగుళ్లకు పుల్‌స్టాప్ పెట్టి.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. అదే విషయాన్ని ప్రియురాలి వద్ద వెల్లడించాడు. అయితే ఆ యువతి ట్విస్ట్ ఇచ్చింది. చేతన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది. దీంతో ఒక్కసారిగా షాకైన అతడు.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. గత తొమ్మిదేళ్లుగా ప్రేయసి సరదాల కోసం రూ.4.50లక్షలు ఖర్చు చేశానని, ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేయాలని సూసైడ్ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-06-02T21:55:11+05:30 IST