ప్రియురాలు ప్రేమగా అడిగే సరికి కాదనలేకపోయాడు.. చివరికి పోలీసులకు చిక్కి పరువు తీసుకున్నాడు.. ఇంతకూ మ్యాటరేంటంటే..

ABN , First Publish Date - 2022-04-16T19:02:22+05:30 IST

ఆ యువకుడు ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. అనంతరం తన మనసులోని మాటను ఆమెకు చెప్పి ఒప్పించాడు. దీంతో ఎగిరి గంతేశాడు. అప్పుడే.. ప్రియురాలు ఏమడిగినా నో చెప్పకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఆమె కోరిక విని కాస్త

ప్రియురాలు ప్రేమగా అడిగే సరికి కాదనలేకపోయాడు.. చివరికి పోలీసులకు చిక్కి పరువు తీసుకున్నాడు.. ఇంతకూ మ్యాటరేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడు ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. అనంతరం తన మనసులోని మాటను ఆమెకు చెప్పి ఒప్పించాడు. దీంతో ఎగిరి గంతేశాడు. అప్పుడే.. ప్రియురాలు ఏమడిగినా నో చెప్పకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఆమె కోరిక విని కాస్త తడబడ్డాడు. అయినా.. ఎలాగైనా ఆమె ముఖంలో సంతోషం చూడాలని నిర్ణయించుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి పరువు తీసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌కు చెందిన సాహిల్ అనే 20ఏళ్ల కుర్రాడు కొద్ది రోజల క్రితం స్థానికంగా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. వెంటనే ఆమెకు ఐ లవ్ యూ చెప్పేశాడు. కొంత సమయం తీసుకున్నప్పటికీ చివరకు ఆ యువతి కూడా అతడి ప్రేమను ఒప్పుకుంది. దీంతో ఆ జంట చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రాంభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ యువతి తన ప్రియుడి వద్ద తన కోరికల చిట్టా విప్పింది. నచ్చిన ప్రదేశాలకు తీసుకెళ్లాలని, ఇష్టమైనవి ఇప్పించాలని కోరింది. దీంతో గురుడు ఒక్కసారిగా షాకయ్యాడు. 



అయితే ఆమె మాటను కాదనలేకపోయాడు. అయితే అందుకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ బట్టల దుకాణానికి ఈ నెల 13న కన్నం వేసి, రూ. 60వేలు దొంగిలించాడు. బట్టల కొట్టు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాను పరిశీలించి సాహిల్‌ను పట్టుకున్నారు. రూ.34వేలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా సాహిల్.. తన వద్ద ఉన్న డబ్బు తీసుకుని తనను వదిలేయాలని పోలీసులను అభ్యర్థించాడు. అరెస్ట్ చేస్తే పరువు పోతుందని ప్రాధేయపడ్డాడు. కానీ పోలీసులు అతడి మాట వినిపించుకోలేదు. కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. 




Updated Date - 2022-04-16T19:02:22+05:30 IST