ఆశా కార్యకర్తపై యువకుడి దాడి
ABN , First Publish Date - 2022-01-22T05:59:39+05:30 IST
కరోనా వ్యాక్సిన వేసేందుకు గ్రామానికి వెళ్లి న ఆశా కార్యకర్తపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు.
వ్యాక్సిన వేయించుకోకున్నా మెసేజ్ వచ్చిందంటూ ఆగ్రహం
నాంపల్లి, జనవరి 21: కరోనా వ్యాక్సిన వేసేందుకు గ్రామానికి వెళ్లి న ఆశా కార్యకర్తపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో శుక్రవారం ఈ సంఘ ట న జరిగింది. బాధితురాలు, స్థానికు ల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిరుమలగిరి గ్రామంలో శుక్రవారం కొవిడ్ సె కండ్ డోస్ వ్యాక్సిన వేసేందుకు నిర్ణయించటంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాల యం వద్దకు చేరుకున్నారు. నాంపల్లి పీహెచసీ నుంచి ఆశా కార్యకర్తలు కవిత, నీలిమలు కొవిడ్ టీకా వేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన జహంగీర్ అనే యువకుడు తాను సెకండ్ డోస్ వేయించుకోకుండానే టీకా తీసుకున్నట్లు మెసేజ్ ఎలా వచ్చిందని ఆశా కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సెకండ్ డోస్ వ్యాక్సిన వేస్తామని కార్యకర్తలు చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ కవితను నిలదీసి దాడికి పాల్పడ్డా డు. అక్కడే ఉన్న సహచర ఆశ కార్యకర్త నీలిమ, కవిత భర్త సైదులు, గ్రామస్థులు వారించినా ఆగ్రహంతో ఆమెను నెట్టివేశాడు. ఈ ఘటనలో కవితకు స్వల్ప గాయాలు కాగా, బాధితురాలు నాంపల్లికి చేరుకొని పీహెచసీ డాక్టర్ ఎక్బాల్, సీఐటీయూ నాయకులకు ఫిర్యాదు చేసింది. ఆశావర్కర్పై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్య తీసుకోవాలని సీఐటీయూ నాయకులు, ఆశా వర్కర్లు నాంపల్లి పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చే శారు. ఆశావర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేశా రు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.