కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు.. నెల రోజుల తర్వాత ఆ యువతి స్టేషన్‌కు వెళ్లి షాకింగ్ విషయం చెప్పింది!

ABN , First Publish Date - 2022-03-12T19:33:33+05:30 IST

20 ఏళ్ల ఆ యువతి వ్యవసాయ శాఖ ఉద్యోగిణి. సమీప గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ ఉంటుంది.

కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు.. నెల రోజుల తర్వాత ఆ యువతి స్టేషన్‌కు వెళ్లి షాకింగ్ విషయం చెప్పింది!

20 ఏళ్ల ఆ యువతి వ్యవసాయ శాఖ ఉద్యోగిణి. సమీప గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె జనవరి 26న హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపులు చేపట్టినా ఫలితం కనిపించలేదు. ఇటీవల ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పి షాకిచ్చింది. 


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగంలో భాగంగా ఆమె పలు గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. అతడిని ఆ యువతి తిరస్కరించింది. కాగా, జనవరి 26న ఓ గ్రామంలో ఒంటరిగా వెళ్తున్న ఆమెను ఆ యువకుడు కిడ్నాప్ చేశాడు. పొలంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి బంధించి అత్యాచారం చేశాడు. 


అనంతరం బలవంతంగా ఓ గుడికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి నెల రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనపై జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-03-12T19:33:33+05:30 IST