సోదరుడికి భారం కాకూడదని.. యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-25T15:02:16+05:30 IST
సోదరుడికి భారం కారాదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది...
హైదారాబాద్ సిటీ/కొత్తపేట : సోదరుడికి భారం కారాదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం, ఏదులాబాద్కు చెందిన సింగారం అనిత, ఆమె కుమార్తె రామేశ్వరి(23), కుమారుడు రాము(20)తో కలిసి నాగోల్ జైపురి కాలనీలో ఉంటోంది. అనిత ఇళ్లలో పనిచేస్తుండగా రాము ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రామేశ్వరి ఇంట్లోనే ఉంటోంది. బుధవారం సాయంత్రం అనిత బయటకు వెళ్లి రాత్రి 7.45 గంటలకు ఇంటికి చేరుకుంది. పిలిచినా రామేశ్వరి తలుపు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు తెరిచి చూడగా ఆమె ఉరేసుకుని కనిపించింది. కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయని, తమ్ముడికి ఆర్థికంగా భారం కావడం ఇష్టం లేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సూసైడ్ నోట్లో రాసింది. అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.