పంజాగుట్టలో యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-12T14:08:51+05:30 IST

యువతి అదృశ్యమైంది. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీకి చెందిన

పంజాగుట్టలో యువతి అదృశ్యం

హైదరాబాద్/పంజాగుట్ట : యువతి అదృశ్యమైంది. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీకి చెందిన ఎల్‌. సుప్రజ(23) ఈనెల 10న న్యాయ కళాశాలలో అడ్మిషన్‌ వివరాలు తెలుసుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అదేరోజు సాయంత్రం సోదరుడు అశోక్‌కుమార్‌ ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. సుప్రజ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-03-12T14:08:51+05:30 IST